సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి వేడుకలు

ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి వేడుకలను రాయికల్ మండల కేంద్రంలో జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను అంతమొందించడానికి గోల్కొండ కోటపై బడుగు వారి జెండాను ఎగురవేయాలని ఎలాంటి వారసత్వ నాయకత్వం గాని, అధికారం గాని, ధన బలం గాని లేని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గెరిల్లా సైన్యాన్ని తయారుచేసి గోల్కొండ కోట పై బడుగు బలహీనవర్గాల జెండాను ఎగురవేసిన గొప్ప చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అలాంటి గొప్ప చక్రవర్తి బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలు మరువలేనివి మనం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల కోసం కృషి చేద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా, నియోజకవర్గ, మండల, అధ్యక్షులు రామ గౌడ్ నారాయణ గౌడ్ సత్యనారాయణ గౌడ్ ఎంపీపీ సంధ్యా సురేందర్ నాయక్ ఎంపీడీవో సంతోష్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి రాయికల్ గౌడ సంఘం అధ్యక్షులు లింబాద్రి గౌడ్ కౌన్సిలర్ మహేష్ గౌడ్ వివిధ పార్టీల నాయకులు రాయికల్ మండల గౌడ సంఘం గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు