సాంబశివుడు కుటుంబానికి 10 లక్షల సాయం

5

నల్లగొండ,మార్చి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మావోయిస్టు కొనపురి సాంబశివుడి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ. పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. చిట్యాలలో టీఆర్‌ఎస్‌ నేత సాంబశివుని 5వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సాంబశివుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాంబశివుని ఆశయాలను సాధిస్తామని తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌. ఆయన కూతురు వివాహ నేపథ్యంలో కుటుంబాన్ని ఆదుకుంటానని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ఆధారంగా పది లక్షలు అందజేసింది. చెక్కును భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో కలిసి నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో సాంబశివుడి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, చంద్రయ్య, కూతురు స్వర్ణకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ సాంబశివుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు..పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రమాద బీమా చేయించి ఇప్పటికే చాలా మందికి రెండు లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు.