సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల

నల్గొండ : నాగార్జునసాగర్‌ నుంచి ఎడమ కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎన్‌ఎన్‌సీ అధికారులు తెలిపారు. దీంతో రబీ కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి తీపి కబురు అందినట్లు అయింది.