సానియాకు ఖేల్రత్న
న్యూదిల్లీ ఆగస్ట్14(జనంసాక్షి):
భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్న అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అవార్డుల ఎంపిక కమిటీ కొద్దిరోజుల క్రితమే సానియా పేరును ఖరారు చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును కేంద్రప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగువారిని ఈ అవార్డు వరించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూప్కుమార్లకు అర్జున అవార్డు దక్కింది. ఈ జాబితాలో యువ క్రికెటర్ రోహిత్శర్మ కూడా ఉన్నారు.