సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

పానుగల్ నవంబర్ 08,జనంసాక్షి
మండలంలోని శాఖాపూర్ గ్రామంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు వసంతం సుబ్బయ్య యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులైన ముంత సుల్తాన్ 27,500,కప్పల భాగ్యమ్మ 18,000, తెలుగు మైబూస్ 10,500 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.చెక్కులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మరియు నాయకులకు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ నెంబర్ అలీం పాషా,ఎనుముల కృష్ణయ్య, నారాయణ,బిచ్చలయ్య,చంద్రయ్య బద్దుల చిన్న నరసింహ,రాములు తదితరులు పాల్గొన్నారు.