సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా విఠల్‌రెడ్డి గెలిచారు. ఆయన మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.