సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి): సీరియల్‌ కిల్లర్‌ సింహాద్రిపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఏలూరులో చోడవరపు సూర్యనారాయణ హత్యకు సంబంధించి పోలీసులకు ఆయన బంధువులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో రామకృష్ణ స్వావిూజీ హత్యకు సంబంధించి సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇప్పటికే ఏడు హత్యలకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. మరో మూడు హత్యలకు సంబంధించి హతుల బంధువులు ఇంకా ఫిర్యాదు చేయలేదు.