సీసీ రోడ్డు పనుల ప్రారంభం

రామారెడ్డి.   అక్టోబర్ 20     (జనంసాక్షీ )   :
సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని  సర్పంచ్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,   జగదాంబ తండా గ్రామ పంచాయతీ  పరిధిలో  అభివృద్ధి పనులను చేపట్టాలని  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  ఆదేశాలు మేరకు   ఎన్ఆర్ ఈజీఎస్   నిధులు నుండి  దాదాపు  పది లక్షల తో  ఆర్ ఆండ్ బీ   రోడ్డు  రమణ తండా వరకు సీసీ  రోడ్డులు ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ కార్యక్ర మంలో   టీఆరెస్  మండల  ప్రధాన కార్యదర్శి  సలవత్ బుచ్చిరెడ్డి, సర్పంచ్ ల  ఫోరం  అధ్యక్షుడు బొమ్మిడి రాంరెడ్డి,  ఎంపీటీసీ సంత్యాలి చంద్రు నాయక్,   మండల  టీఆరెస్  సీనియర్  నాయకు లు  ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ సలావత్ బన్సీ , గంగారెడ్డి,  గ్రామ  అధ్యక్షుడు భూక్య నంద నాయక్ ,  అన్నారం ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,  కో అప్సన్ మెబర్ సలవత్ నంద నాయక్,   గ్రామా వార్డు సభ్యులు భూక్య నారాయణ,  గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు