సుష్మా నివాసం ఎదుట బందోబస్తు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నివాసం ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐపీఎల్ కుంభకోణంలో తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీకి వీసా మంజూరులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.