సూసైడ్ నోట్ రాసిన విద్యార్థి మృతి..

6

నల్గొండ : హుజూర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..చైతన్య పాఠశాలలో నాగార్జున రెడ్డి 8వ తరగతి చదువుతున్నాడు. రూ. 500 కనిపించకపోవడంతో నాగార్జున రెడ్డిపై ఇతర విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. తీవ్రమనస్థాపానికి గురైన నాగార్జునరెడ్డి సూసైడ్ నోట్ రాసి ఈనెల 18వ తేదీన అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా గొడవలు జరుగుతున్న స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలోని నిర్జీవ ప్రదేశంలో నాగార్జున రెడ్డి 80 శాతం మేర కాలిన గాయాలతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఇతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీనితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ యాజమాన్యమే దీనికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.