సెక్యూరిటీ గార్డ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు మాదిగ డిమాండ్.

కులం పేరుతో దూషించిన సింగరేణి ఫైన్ క్లీన్ ఏరియా భూపాల పల్లి సెక్యూరిటీ గార్డ్ వీరెల్లి సంపత్ రెడ్డి పై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెల మాదిగ అన్నారు గురువారం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 30వ తేదీన మాదిగ కులానికి చెందిన లారీ ఓనర్ మంద తిరుపతి లారీ సీరియల్ గురించి అడగగానే అక్కడే సెక్యూరిటీగా ఉన్నటువంటి సంపత్ రెడ్డి అనే వ్యక్తి ఆగ్రకుల అహంకారంతో మాదిగోనికి లారీలు కొన్నప్పటి నుండి కన్ను నెత్తికొక్కాయి అని దళిత బంధువు వల్ల మీ మాదిగోల్లకు అందరు కార్లు లారీలు కొని బాగా ఓవర్ చేస్తున్నారని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కులం పేరుతో దూషించి అవమానించాడు అంతటితో ఆగకుండా లారీపై తప్పుడు రిపోర్ట్ చేసి లారీని లోడ్ కాకుండా చేసి మంద తిరుపతి మాదిగను మానసికంగా మనోవేదనకు గురి చేస్తున్నాడు అయితే ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ప్రయత్నం చేస్తున్న మాదిగలను అగ్రకుల అహంకార వాదుల చర్యలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించం అని ఓదెల మాదిగ అన్నారు వెంటనే సంపత్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.అలాగే జోగులాంబ గద్వాల జిల్లా. ధరూరు మండలంలోని రేవుల పల్లె గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన కూర రఘు రెడ్డి అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం సమయంలో కూరాతికూరంగా మదమెక్కిన ఉన్మాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తల భాగాన్ని పూర్తిగా ద్వస్వం చేశారు. కూర రఘు రెడ్డిని పలు సెక్షన్ల కింద ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పర్లపెల్లి సాంబయ్య, ఏ రాజు,దిలీప్, కుమార్,దేవేందర్, చంటి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.