సెప్టెంబర్ 9న సింగరేణి కాంట్రాక్టుకార్మికులసమ్మె ను జయప్రదంచేయండి

–సింగరేణి కాంట్రాక్టుకార్మి కసంఘాలజేఏసీపిలుపు

షేక్ యాకుబ్ షావలి
డి ప్రసాద్ రామ్ చందర్ .
వీరన్న .రాయండ్ల కోటి లింగం.

టేకులపల్లి ఆగస్టు 25( జనం సాక్షి ): సెప్టెంబర్9 నుండి సింగరేణిలో కాంట్రాక్టుకార్మికుల సమ్మెను జయప్రదం చేయలని రాష్ట్రజేఏసీ పిలుపులో భాగంగా ఇల్లందుసింగరేణికాంట్రా క్టుకార్మికసం ఘాల జెఏసి ఆధ్వర్యం లో గురువారం టేకులపల్లి హైటెక్ కాలనీలో కాంట్రా క్టుకార్మికుల మస్టర్ అడ్డా వద్ద డి ప్రసాద్ అధ్యక్షత న జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  జేఏసీ నాయకులు షేక్ యాకుబ్ షావలి, గుగులోతు రామ్ చందర్ ,కుడుదులవీర న్న, రాయండ్ల కోటిలిం గం,పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రా క్టుకార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం మూలాన లాభాలు వచ్చాయని, ఈలాభాలకు కారకులైన కాంట్రాక్టుకార్మికుల ఎడల సింగరేణియాజమాన్యం, రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం గావ్యవహరిస్తున్నారని అన్నారు. ఫిబ్రవరి 9న లేబర్ అధికారుల సమక్షంలో కాంట్రాక్టుకార్మికు ల 16డిమాండ్లపై సింగరేణి అధికారులు ఒప్పం దంచేసుకొని రెండునెలల గడువుతీసుకొని కాల యాపనచేస్తూన్నారని విమర్శించారు. ఒప్పందం అమలు చేయకుండా సింగరేణి కాంటాక్ట్ కార్మికులను మోసంచేస్తుందన్నారు. ఈ ఒప్పందం అమలు కొరకు కోల్ బెల్టు ఎమ్మె ల్యేలు కాంట్రాక్ట్ కార్మి కులసమస్యలుపట్టిం చుకొని ముఖ్యమంత్రి,
సింగరేణి చైర్మన్ తో మాట్లాడిలేబర్అధికా రులసమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలుచే సేవిధంగా ఒత్తిడితేవాల నివిజ్ఞప్తిచేశారు.
లేనియెడలసింగరేణి అధికారుల మోసంవల్ల కాంట్రాక్టు కార్మికులు సెప్టెంబరు 9వతారీకు నుండి జరుగు నిరువదిక సమ్మెచేయవలసివస్తుం దనిహెచ్చరించారు.