సేవా రత్న నేషనల్ అవార్డు 2023 అందుకున్న మాడుగుల రాజ్ కుమార్

సేవా రత్న నేషనల్ అవార్డు 2023 అందుకున్న మాడుగుల రాజ్ కుమార్

భీమదేవరపల్లి:అక్టోబర్
(16)జనం సాక్షి న్యూస్

ఢిల్లీలో అక్టోబర్15న న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా పురస్కరించుకొని మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు మాడుగుల రాజు కుమార్ బహుజన రైటర్స్ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్లోబహుజన సాహిత్య అకాడమీ బిఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవా రత్న నేషనల్ అవార్డును ఢిల్లీలో ఆదివారం అందుకున్నారు.
ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, కవులకు, రచయితలకు,సంఘ సేవకులకు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలియజేశారు .ఇండియాలోని 27 రాష్ట్రాల నుండి సుమారుగా 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరైనారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ కేబినెట్ మినిస్టర్ డెల్హీ సోషల్ వెల్ఫేర్ లేబర్ ఎంప్లాయిమెంట్ మినిస్టర్ శ్రీ రాజ్ కుమార్ ఆనంద్ , ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీ విశేష్ రవి గార్లు పాల్గొన్నారు. ఈ అవార్డు అందజేసిన వారితో పాటుగా ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు మన్వీర్ సింగ్ పచ్చ నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం విజయ లలిత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏమేం గౌతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాడుగుల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు ఇచ్చిన బహుజన సాహిత్య అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.