స్కూళ్లలో ఇంగ్లీష్ బోధనపై సీఎం జగన్ సవిూక్ష
అమరావతి,నవంబర్9(జనం సాక్షి): స్కూళ్లలో ఇంగ్లీష్ బోధనపై సీఎం జగన్ సవిూక్ష సమావేశం నిర్వహించారు. నాడు- నేడులో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాలని సీఎం నిర్ణయించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలన్నారు.