స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో కిరోసిన్‌ పట్టివేత

మహబూనగర్‌ : మంత్రి డీకే అరుణ కుంటుంబానికి చెందిన స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామ శివారులోని క్రషర్‌ ప్లాంట్‌లో కిరోసిన్‌ను ఓ ట్యాంకర్‌ నుంచి వేరే ట్యాంకర్‌లోకి నింపుతుండంగా స్థానిక నేతలు ఫిర్యాదుతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాంకర్‌ 9 వేల లీటర్ల కిరోసిన్‌ ఉన్నట్లు చెప్పారు.