స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డిఓ మధుసూదన్

వేములవాడ, అక్టోబర్ 16 (జనంసాక్షి): త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఆర్డిఓ మధుసూదన్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలతో పాటు, ఎన్నికల సామాగ్రి నిర్వహణ, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట అర్బన్ తహశీల్దార్ మహేష్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.