స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు
– రాజీవ్ శర్మ
న్యూఢిల్లీ, జులై31(జనంసాక్షి): స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలన్నది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమనీ, ఇదే విషయాన్ని కేంద్ర ¬ంశాఖకు తెలియజేశామనీ తెలంగాణ సీఎస్ రాజీవ్శర్మ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజనకు కమిటీ వేయాలని కేంద్ర¬ంశాఖ సూచించిందని ఆయన తెలిపారు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే మేం నడుచుకుంటామనీ, కోర్టులను మేము నమ్ముతామని ఆయన చెప్పారు. పరస్పర అవగాహనతో ఉద్యోగులను పంపిణీ చేసే అవకాశంలేదని రాజీవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం మొండివాదనతో ముందుకెళ్తుందని రాజీవ్ శర్మ ఆరోపించారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడ పనిచేయాలన్నది సర్కార్ అభిమతమన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే సమస్య రాదన్నారు.