స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలి-కలెక్టర్

కామారెడ్డి బ్యురొ ఆగస్ట్21(జనంసాక్షి);
స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తహసిల్దార్లతో  మాట్లాడారు. స్లాట్ బుక్ చేసిన రైతువి రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్ సెలవులో వెళితే ఉప తహశిల్దార్ కు ఇంచార్జి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని కోరారు.వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఏవో రవీందర్, సూపరిండెంట్ లు సరళ , ఉమలత, సప్న, సువర్ణ, రంజిత్ కుమార్, నారాయణ పాల్గొన్నారు.