స్వలింగ సంపర్కం అంశంపై నిర్ణయాన్ని.. 

కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం
– ధర్మాసనానికి స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, జులై111(జ‌నం సాక్షి) : స్వలింగ సంపర్కం నేరమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై బుధవారం కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కం అంశంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఆర్టికల్‌ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్‌ జడ్జిలు విచారణ చేపడుతున్నారు. బ్రిటీష్‌ కాలం నాటి చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే వాళ్లకు జీవిత కాల జైలు శిక్షను విధిస్తారు. రెండవ రోజు కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తుషార్‌ మెహత తన అభిప్రాయాన్ని వినిపించారు. స్వలింగ సంపర్కం కేసులో కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేస్తున్నామన్నారు. ఆ సమయంలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా స్పందించారు. 377 ఆర్టికల్‌ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమనా లేక దాన్ని నేరంగా పరిగణించరాదు అన్న నిర్ణయాన్ని తమకే వదిలేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 2013లో కోర్టు ఇచ్చిన తీర్పును మాత్రమే పరిశీలిస్తామని సోమవారం ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం విషయం తెలిసిందే.
——————————