హుజూరాబాద్‌కు త్వరలోనే నోటిఫికేషన్‌

అప్రమత్తం అవుతున్న రాజకీయ పార్టీలు
కరీంనగర్‌,ఆగస్ట్‌5( జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలకు ఇప్పటికే సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. రెండు, మూడ్రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడే ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని సీఈసీకి కేసీఆర్‌ సర్కార్‌ లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అలెర్ట్‌ అయ్యాయి. హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో కేసీఆర్‌ బిజీ బిజీగా ఉన్నారు.