హైకోర్టులో మంత్రి పార్థసారధికి ఊరట
హైదరాబాద్: మంత్రి పార్థసారధికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఆర్ధిక నేరాల కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో మంత్రికి రెండు నెలల జైలు, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యే వరకు ఈ స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది.



