హైకోర్టు కోసం లాయర్ల విధుల బహిష్కరణ

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టు విధుల బహిష్కరణ విషయంలో మంగళవారం లాయర్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. న్యాయవాదులు 62 రోజులుగా విధులు బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌పై న్యాయవాదులు ఆందోళన నిర్వహిస్తున్నారు.