1న నిర్మాణ కార్మికుల సభ

విజయవాడ,అక్టోబర్‌28(జనం సాక్షి):  నవంబర్‌ ఒకటిన భవన నిర్మాణ కార్మికుల సామూహిక రాయబార సభను నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఉమామహేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావులు ప్రకటించారు. సోమవారం ఉదయం విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశశంలో  మాట్లాడుతూ.. ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడంలేదని ఆరోపించారు. కార్మికుల కుటుంబాలకు నెలకు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకూ పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.