10వ తరగతి బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు
` ముసాయిదాకు సీబీఎస్ఈ ఆమోదం
న్యూఢల్లీి(జనంసాక్షి): 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్ఈ ఆమోదం రెండు పరీక్షలూ పూర్తి సిలబస్పై ఉంటాయని, ప్రాక్టికల్ లేదా ఇంటర్నల్ అసెస్మెంట్ ఒకేసారి ఉంటుందని వెల్లడిరచింది
పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి
` తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్(జనంసాక్షి): పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. 9వ తరగతి వారికి 2025`26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026`27 నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది.