సీపీఐ(ఎం) కార్యకర్త స్వామి మృతి

 

నివాళ్లు ఆర్పించిన సీపీఐ(ఎం) నేతలు

కారేపల్లి: కారేపల్లిమండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) కార్యకర్త పూనెం స్వామి(55) ఆదివారం మృతి చెందాడు. కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న స్వామి చికిత్స పొందుతూ ఇంటి వద్దనే మృతి చెందాడు. స్వామికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. స్వామి మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య, నున్నా నాగేశ్వరరావులు సంధర్శించి భౌతికకాయంపై పార్టీ పతకాన్ని ఉంచి నివాళ్లు ఆర్పించారు. ఈసంధర్బంగా వారు మాట్లాడుతూ సీపీఐ(ఎం) పోరాటాల్లో పూనెం వారి కుటుంబం పార్టీకి అండగా ఉందన్నారు. స్వామి లేని కుటుంబంతో పాటు పార్టీకి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులను ఏదార్చి సానుభూతినితెలిపారు. ఎర్రబోడు పాయం పొట్టెమ్మ(90) అనారోగ్యంతం మృతి చెందగా అమె మృతదేహాన్ని వారు సంధర్శించి నివాళ్లు ఆర్పించారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మెరుగు సత్యనారాయణ, కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, బాదావత్‌ రాములు, పండగకొండయ్య, కుర్సం శ్రీను, కరపటి సీతారాములు, పాయం వెంకటేశ్వర్లు, రేపాలకుల లాలయ్య, కుందనపల్లి పవన్‌, వజ్జా శేఖర్‌, కాంగ్రెస్‌ నాయకులు కుర్సం సత్యనారాయణ తదితరులు ఉన్నారు.