19వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్ సెప్టెంబరు06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 19వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం దీక్షలో పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం సతీమణి మహిళా కో-ఆర్డినేటర్ కుంజా వెంకటరమణ ఎస్.కె గౌష్యా బేగం పూలమాలలు అందించి దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు జేఏసి కన్వినర్ కే వి రమణ, జేఏసీ ప్రధాన కార్యదర్శి దామర శ్రీనివాసరావు, డాక్టర్ లక్కోజు విష్ణువర్ధన్ సంఘీభావం ప్రకటించారు.