లోక్‌సభ 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని విభజించొద్దని ఎంపీలు నినాదాలు చేశారు. ఎంపీలు తీరుపై స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.