చివరి రెండు టెస్టులకు జట్టు ఎంపిక

వరంగల్‌ : 2014లోపు తెలంగాణ వస్తుందని మంత్రి సారయ్య తెలిపారు. ఈమేరకు కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఎంపీలందరం కలిసి తెలంగాణపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు.

ముంబయి : ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. గాయంతో బాధపడుతున్న ఉమేష్‌ యాదవ్‌ స్థానంలో అశోక్‌ దిండాకు చోటు కల్పించారు. కాగా జట్టు కూర్పులో ఎటువంటి మార్పు ఉండబోదని, మాటిమాటికీ ఆటగాళ్లను మార్చడం మంచిది కాదని సోమవారం కెప్టెన్‌ ధోనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.