మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 15
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం పరామర్శించారు. ఈ సందర్భంగా కాకలారం గ్రామం మాజీ సర్పంచ్ నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందడం పై డాక్టర్ మంద జగన్నాథం కాకులారం గ్రామానికి చేరుకొని నారాయణ పార్థివదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలంపూర్ నియోజకవర్గ తెరాస పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్, ఆంజనేయులు, దానం, యోహాను తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.