ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

పెబ్బేరు నవంబర్19 ( జనంసాక్షి ):
పెబ్బేరు మండల కేంద్రంలో సుభాష్ చౌరస్తా లో భారత రత్న, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 105 వ జయంతి వేడుకలను పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయికరణ చేసి బీదలకు ఆర్థిక ఫలాలు అందేలా చేసారని, గరిబి హఠావో నినాదం తో పేదరిక నిర్ములకు ఎంతో కృషిచేసారని గుర్తు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గరీబీ హటావో” (పేదరికాన్ని పారద్రోలండి) అనే నినాదంతో,ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఉద్దేశంతో ప్రతి పెదవానికి ఇల్లు నిర్మించిందని,
1968 జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యారంగాన్ని డెవలప్మెంట్ చేసింది అని తెలిపారు, ఈర్యక్రమంలో మండల జిల్లా యూత్ నాయకులు గంధం రంజిత్ కుమార్, మాజీ సార్ సర్పంచ్ లు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్,జిల్లా మైనార్టీ నాయకులు షకీల్, ఎస్ సి సెల్ నాయకులు సర్వేశ్,టౌన్ యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రణధీర్ రెడ్డి, సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ చంద్రశేఖర్, సత్యనారాయణరెడ్డి, ఈశ్వర్ రెడ్డి,శివారెడ్డి,నరసింహ్మ నాయుడు,గంధం సునిల్,గోఖరి,జి నరసింహ గౌడ్, ఈశ్వర్, బోట్ట శ్రీను,శంకర్ నాయుడు, వినయ్,యుత్ కాంగ్రెస్ నాయకులు హెమంత్ రెడ్డి,ప్రవిణ్ గౌడ్, ఎం,డి,సాధీక్,గంధం ఆంజీ,పర్సా,శివకుమర్ తదితరులు పాల్గొన్నారు.