విద్యుత్ సరఫరా నిలిపివేత,
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్ట్21
విద్యుత్ సరఫరాకు చెట్లు అడ్డంగా ఉండడంతో వాటిని తొలగించేందుకు చేపట్టిన చర్యలో భాగంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వాజ్ పెయి నగర్ సబ్ స్టేషన్ ఏఈ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.సబ్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురం రాధాకృష్ణ హౌసింగ్ సొసైటీ కాలనీ ఫీడర్ లైన్ పరిధిలోని శ్రీ కాలనీ బాలాజీ కాలనీ అంతయ్యా కాలనీ,జీకే నగర్ తదితర ప్రాంతాలలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు,ఆర్కేహెచ్ కాలనీ సాయి నగర్,సాయినాధపురం తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుంది అని తెలిపారు.ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.