దక్షిణాఫ్రికా 244 ఆలౌట్‌ : భారత్‌ ఆధిక్యం 36

జొహనెన్‌బర్గ్‌: భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సెషన్‌ ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంటూ 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 213/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 31 పరుగుల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆర్ధశతకం పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఫిలాండర్‌(59)తో పాటు డు ప్లెసిన్‌(20), మోర్కెల్‌(7)లను జహీర్‌ఖాన్‌ ఔట్‌ చేయగా, స్టెయిన్‌(10)ను ఇషాంత్‌ శర్మ పెవిలియన్‌ పంపాడు. భారత్‌ బౌలర్లలో జహీర్‌ 4, ఇషాంత్‌ 4, షమి రెండు వికెట్లు తీశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం అభించింది.