3,26,920/- నగదును సీల్ చేసిన మర్పల్లి పోలీసులు

3,26,920/- నగదును సీల్ చేసిన మర్పల్లి పోలీసులు

మర్పల్లి అక్టోబర్ 19 (జనంసాక్షి)  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందువలన యాభై వేల కంటే ఎక్కువగా నగదు ఉంటే సీల్ చేయబడుతుందని మర్పల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో టీ జంక్షన్ నందు వాహన తనిఖీలు చేస్తుండగా ఎలాంటి రసీదులు లేకుండా మొత్తం  3,26,920/- రూపాయలు  రెండు వాహనాల్లో తరలిస్తుండగా మర్పల్లి పోలీలు వారిని పట్టుకున్నారు.. ఇట్టి రూపాయలను  సీజ్ చేసి  డబ్బును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు