4వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష

దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్                  టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ **           బషీరాబాద్ నవంబర్ 10, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో కాశీం పూర్ గ్రామ పంచాయతీలో కలిసి ఉన్న గ్రామం మల్కన్ గిరి గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు 4వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ మాట్లాడుతూ వెంటనే నూతన గ్రామపంచాయతీగా మల్కాన్ గిరి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ వేరు కావడం వలన గ్రామ అభివృద్ధి జరుగుతుంది.అదేవిధంగా ప్రజలకు అన్ని విధములుగా అభివృద్ధి జరుగుతుంది తెలిపారు.ఈ కార్యక్రమంలో పెదేముల్ మండల జడ్పిటిసి దారా సింగ్, బషీరాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, జనార్దన్ రెడ్డి,మాధవ రెడ్డి, నర్శిములు గౌడ్,శ్రీకాంత్, భీమప్ప,లక్ష్మన్ రావు,నరేష్, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.