స్విట్జర్లాండ్‌లో రెండు రైళ్లు ఢీ: 44 మందికి గాయాలు

స్విట్జర్లాండ్‌: స్పెయిన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను మరువక ముందే స్విట్జర్లాండ్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ స్విట్జర్లాండ్‌లో వాడ్‌ కాన్టన్‌ రాష్ట్రంలో దాదాపు 44 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించినట్లు వాడ్‌ కాంటన్‌ పోలీస్‌ అధికారి జీన్‌ క్రిస్టోప్‌ తెలిపారు.