48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమల్లో భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురెసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరో 48 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలు చోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ కేంద్రం తెలిపింది. తమిళనాడు శ్రీలంకల మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి బలపడిందని దాని వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.