6 గ్యారంటీల గురించి వివరిస్తూ గడపగడపకు తిరుగుతూ. రెడ్డిపల్లి గ్రామంలో

6 గ్యారంటీల గురించి వివరిస్తూ గడపగడపకు తిరుగుతూ. రెడ్డిపల్లి గ్రామంలో

మహా ముత్తారం అక్టోబర్ 14( జనం సాక్షి) ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మహా ముత్తారం మండలం రెడ్డి పల్లి గ్రామంలో ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల గురించి గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రెడ్డి పల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించడం.రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని .
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లో గ్యారెంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తుందని చెప్పడం జరిగింది.మహాలక్ష్మి పథకం
•ప్రతి మహిళకు ప్రతి నెల రూపాయలు 2500, లు 500 కి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులోఉచిత ప్రయాణం.•రైతు భరోసా పథకం కింద ప్రతి రూ.15000 లు రూ 12000, లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు వరి పంటకు రూపాయల 500 బోనస్.
గృహ జ్యోతి పథకం* ప్రతి ఇంటికి అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్,
ఇందిరమ్మ ఇంటి పథకంఇంటి స్థలం, గృహ నిర్మాణానికి 5 లక్షలు అందించనున్నారు•యువ వికాస పథకంకింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు,చేయూత పింఛన్* ఆసరా పెన్షన్ 4,000/- రూపాయలకు పెంపు కల్పించనుందని తెలిపడం జరిగింది..