మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్
శ్రీనగర్,(జనంసాక్షి): సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ బలగాలు మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. శుక్రవారం రాత్రి పూంచ్ జిల్లాలోని మంథార్, హామిపూర్ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. గత పది రోజుల్లో 18 సార్లు పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.