జవాన్లపై దాడిలో పాక్‌ పాత్ర ఉంది: ఆంటోనీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో భారత జవాన్లపై జరిపిన కాల్పుల ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. సరిహద్దు నియంత్రణ రేక వెంబడి భారత జావాన్లపై దాడి జరిగిన ఘటనలో పాక్‌ ప్రత్యేక దళాల పాత్ర ఉందని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ సైన్యం సహకారం లేకుండా సరిహద్దుల్లో ఏమీ జరగదని ఆయన వివరించారు.