రపటికి వాయిదా పడ్డ ఉభయసభలు

న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం మూడింటికి ప్రారంభమైన లోక్‌సభ కాసేపటికే తిరిగి రేపటికి వాయిదా పడింది. బొగ్గు కేటాయింపుల దస్త్రాల గల్లంతు విషయంలో ప్రధాని వివరణపై ఉభయసభల్లో విపక్షాల నినాదాలు పెద్ద ఎత్తున కొనకసాగడంతో సభలను రేపటికి వాయిదా వేశారు. ఈ దస్త్రాల గల్లంతు అంశం మీదే ఈ రోజు లోక్‌ సభ వరసగా నాలుగు సార్లు వాయిదా పడింది.