జగన్‌పై మారెప్ప తీవ్ర విమర్శలు

ఢిల్లీ : వైకాపాలో మరోమారు అసమ్మతి సెగ రగిలింది. జగన్‌పై మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్యనేత మారెప్ప తీవ్ర విమర్శలు చేశారు. తనకు జగన్‌ అన్యాయం చేశాడని ఆయన పేర్కొన్నారు. జగన్‌కు తండ్రి లక్షణాలు రాలేదని వైకాపా ముఖ్యనేత మారెప్ప అన్నారు. జగన్‌కు రాజకీయ అనుభవం లేదని, అవినీతి ఆరోపణలతో జగన్‌ జైలుకు వెళ్లారని మారెప్ప ఆరోపించారు. తెలంగాణకు అడ్డం కాదు, నిలువు కాదని చెప్పి ఇప్పుడు మాట మార్చారని, తెలంగాణలో వైకాపా క్లీన్‌బౌల్డ్‌ అవుతుందని ఆయన అన్నారు. వైఎస్‌కు ఆత్మీయులైన కొండా సురేఖ లాంటి వాళ్లని జగన్‌ దూరం చేసుకున్నారని, మానుకోటలో జగన్‌ కోసం రాళ్ల దెబ్బలు తిన్న కొండా సురేఖను పట్టించుకోలేదని, హిట్లర్‌, మున్సోలిని కనుక జగన్‌ అహంకారం, నియంతృత్వం చూస్తే ఆత్మహత్య చేసుకునేవాళ్లని మారెప్ప ఆరోపించారు.