ఓటింగ్ జరగకూడదని అనలేదు : దిగ్విజయ్
ఢిల్లీ : నేనే చెప్పింది తప్పు అయితే అసెంబ్లీకి క్షమాపణ చెబుతానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగకూడదని తాను అనలేదన్నారు. ఓటింగ్ జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై అసెంబ్లీకి రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సభా కార్యకలాపాలను వైకాపా అడ్డుకోవడం సబబు కాదని దిగ్విజయ్ పేర్కొన్నారు.