సంక్షిప్త సందేశంతో ఆవ్‌ సభ్యత్వం

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా జనవరి 26 నాటికి కోటిమందిని సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. తమ పార్టీలో సభ్యులుగా చేరేందుకు సంక్షిప్త సందేశం ఇస్తే చాలని ఆయన తెలిపారు. ఆమ్‌ఆద్మీ లో సభ్యులు కావాలనుకునే వారు 07798220033కి సందేశం పంపాలని ఆయన తెలిపారు.