డెన్మార్క్‌ మహిళపై అత్యాచారం

కేసులో ఇద్దరికి 3 రోజుల కస్టడి
న్యూఢిల్లీ: దేశరాజధానిలో డెన్యార్క్‌ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ కోర్టు మూడ్రోజుల పోలీసు కస్టడీ విధించింది. భారత పర్యటనకు వచ్చిన 51 ఏళ్ల డెన్మార్క్‌ మహిళపై ఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు ఆరుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.