సునందా పుష్కర్‌ మృతి పై నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిధరూర్‌ భార్య సునందా పుష్కర్‌ మృతిపై కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఇవాళ సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి ఔషధ వినియోగం మృతికి కారణమని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని, అయితే ఎందుకు మోతాదుకు మించి ఔషదాన్ని మృతురాలు వినియోగించారో తెలపాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.