లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి.బీఎన్‌ఈ సెన్సెక్స్‌ 86 పాయింట్లు లాభపడి 21,337 వద్ద ముగిసింది. నిఫ్టీ 25పాయింట్ల లాభంతో 6,338 వద్ద ముగిసింది. సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, లుపిన్‌, బీపీసీఎల్‌,హిందాల్కో తదితర షేర్లు లాభపడగా, ఆసియన్‌ పెయింట్స్‌, ఎన్‌బీఐ, కెయిర్న్‌ ఇండియా, ఏసీసీ, గ్రాసిమ్‌ తదితర షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.61.86 ఉంది.