దిగ్విజయ్‌ సింగ్‌తో ముగిసిన జానా భేటీ

ఢిల్లీ: దిగ్విజయ్‌సింగ్‌తో మంత్రి జానారెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిణామాలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. సీఎం కిరణ్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. తాజా రాష్ట్ర పరిణామాలు కేంద్రంలో పెద్దలు అంతా చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికలపై దిగ్విజయ్‌తో చర్చించలేదన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. అభిప్రాయం కోసమే అసెంబ్లీకి బిల్లు వచ్చిందని తెలిపారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండదని పేర్కొన్నారు.