DR. బిఆర్ అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డు పొందిన తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం

DR. బిఆర్ అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డు పొందిన తెలంగాణ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం

ధర్మపురి (జనం సాక్షి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డును పొందారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించి మాలలను ఒకతాటిగా నడిపిస్తూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ఈ జాతీయ అవార్డు పొందారు. ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన నాల్గవ ఆల్ ఇండియా బహుజన రైటర్స్ కాన్ఫరెన్స్ లో వివిధ రంగాలలో విశేషంగా కృషి చేసిన వారికి జాతీయ అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాన్షిరాం సోదరి కౌర్,ఢిల్లీ రాష్ట్ర కార్మిక, పట్టణ, గృహ నిర్మాణ,క్రీడలు,సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్,ఢిల్లీ స్థానిక ఎమ్మెల్యే విశేష్ రవి అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డును బొల్లం మల్లేశం కు అందజేశారు.తను చేస్తున్న కృషికి జాతీయ స్థాయి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, తన బాధ్యత మరింత పెరిగిందని బహుజన సాహిత్య అకాడమీఅధ్యక్షుడు నల్ల రాధాకృష్ణకు మరియు సహకరించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు, ఎంపీ వెంకటేష్ నేతకు బిఎస్ఏ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన బొల్లం మల్లేశం.