స్టేషన్ ఘన్ పూర్, జనగామలో వీడిన ఉత్కంఠ

జనగామ (జనంసాక్షి ) : జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రైతుబంధు సమితి ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసి ఛైర్మన్ పదవి అప్పగించింది. నిన్ననే బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధరన్ ను ఎంబీసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది. తలకొండపల్లి జడ్పీటిసి ఉప్పల వెంకటేశ్ కు మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.

తాజావార్తలు