మహేశ్ గౌడ్ వి చిల్లర వ్యాఖ్యలు: హరీశ్ రావు
బీఆర్ఎస్ మాజీ నేత, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో హరీశ్ రావు రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిటీ నోటీసులు జారీ చేసిన తర్వాత ఈటల, హరీశ్ భేటీ అయ్యారని, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఫోన్ లో చర్చలు జరిపారని కూడా మహేశ్ గౌడ్ ఆరోపించారు. పెళ్ళిలోనో, చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు. ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నాం’’ అంటూ హరీశ్ రావు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.